శంకర్ – చరణ్ ల భారీ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ కి ఆల్ సెట్.!

శంకర్ – చరణ్ ల భారీ ప్రాజెక్ట్ నెక్స్ట్ షెడ్యూల్ కి ఆల్ సెట్.!

Published on May 1, 2022 10:00 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇండియన్ జేమ్స్ కేమరూన్ తో అని అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ సినిమాని శంకర్ శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తన కెరీర్ లో మరో సాలిడ్ సోషల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా పంజాబ్ లో కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. అయితే ఈ షెడ్యూల్ అనంతరం ఇప్పుడు ఇంకో కీలక షెడ్యూల్ కి సిద్ధం తెలుస్తుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఈ మే 5 నుంచి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ విశాఖపట్నంలో స్టార్ట్ కాబోతుందట. నిజానికి ఈ షెడ్యూల్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉంది కాస్త లేట్ అయ్యింది. ఇందులో పలు కీలక సన్నివేశాలు శంకర్ తెరకెక్కించనున్నారట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు భారీ బడ్జెట్ తో తమ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు