అల్లరి నరేష్‌ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్!

అల్లరి నరేష్‌ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” ట్రైలర్‌కి సూపర్ రెస్పాన్స్!

Published on Nov 13, 2022 10:35 PM IST


అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం అల్లరి నరేష్ కి 59 వ చిత్రం. మరోసారి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మేకర్స్ నిన్న ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇది యూట్యూబ్‌లో 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో ట్రెండింగ్‌లో కూడా ఉంది. ఈ చిత్రం లో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటించగా, జాంబీ రెడ్డి ఫేమ్ ఆనంది కథానాయికగా నటించడం జరిగింది. ఏఆర్ మోహన్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా దీనిని నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్, సంపత్ రాజ్, ప్రవీణ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు