డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ!

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ!

Published on Dec 20, 2022 7:03 AM IST

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ హీరోగా ఏ. ఆర్.మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. జీ 5 లో ఈ చిత్రం డిసెంబర్ 23 నుండి డిజిటల్ ప్రీమియర్ గా ఓటిటి ప్రేక్షకులను అలరించనుంది.

సోషల్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా ఆనంది నటించింది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీ తేజ్ లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ పతాకంపై సంయుక్తం గా నిర్మించడం జరిగింది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు