మహేష్ సినిమా పై ఆ వార్త అవాస్తవం !

మహేష్ సినిమా పై ఆ వార్త అవాస్తవం !

Published on Jan 31, 2023 12:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో ఓ క్రేజీ రోల్ ఉందని, ఇది ఒక ఏడేళ్ల పాప పాత్ర అని, పైగా ఈ సినిమా కథ మొత్తం ఆ పాప చుట్టూ సాగుతుందని..అందుకే ఆ పాత్రలో అల్లు అర్జున్ గారాల పట్టి చిన్నారి ‘అల్లు అర్హా’ నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమా టీమ్ కి సంబంధించిన ఓ మెంబర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ వార్త పూర్తిగా అబద్ధం అని తేలింది.

ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అన్నట్టు పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు