ఈ స్టార్ హీరోస్ తో ఏపీ కోసం అల్లు అర్జున్ కూడా.!

ఈ స్టార్ హీరోస్ తో ఏపీ కోసం అల్లు అర్జున్ కూడా.!

Published on Dec 2, 2021 9:56 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం తన భారీ సినిమా పుష్ప ది రైజ్ చిత్రంలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ లెవెల్లో రిలీజ్ కి ఈ చిత్రం సిద్ధం అవుతుండగా ఇటీవల ఆంధ్ర రాష్ట్రాన్ని భారీ ఎత్తున వరదలు వచ్చి భీబత్సం సృష్టించాయి. మరి ఈ బాధితుల కోసం ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ నిధికి నిన్న మన టాలీవుడ్ స్టార్ హీరోలు అంతా కూడా విరాళం ఇవ్వడం స్టార్ట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు సహా రామ్ చరణ్ కూడా చెరో 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అయితే వీరితో పాటుగా ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. తాను కూడా తన వైపు నుంచి 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఇక ఇదిలా ఉండగా తన పుష్ప నుంచి డిసెంబర్ 6న మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కట్ ని రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు