ప్రఖ్యాత జిక్యూ వారి ‘లీడింగ్ మ్యాన్’ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

ప్రఖ్యాత జిక్యూ వారి ‘లీడింగ్ మ్యాన్’ అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Published on Dec 14, 2022 11:17 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన పుష్ప ది రూల్ మూవీ వచ్చే ఏడాది చివరిలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల అలవైకుంఠపురములో, పుష్ప ది రైజ్ మూవీస్ తో హీరోగా దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ లేటెస్ట్ గా న్యూయార్క్ కి చెందిన అమెరికన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ జిక్యూ వారి నుండి లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డుని సొంతం చేసుకున్నారు. ఆయన సూపర్ స్టైల్, ఎలిగెంట్ లుక్స్ కి గాను ఈ అవార్డు లభించింది.

కాగా జిక్యూ సంస్థ టీమ్ సభ్యులు ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసి అక్కడి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఆయనకు ఈ అవార్డుని అందించడం జరిగింది. కాగా ఆ ప్రఖ్యాత సంస్థ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఈవెంట్ తాలూకు ఫోటోలని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసారు. బ్లాక్ కలర్ సూట్ లో అదిరిపోయే స్టైల్ లో సూట్ వేసుకుని అవార్డు అందుకుంటున్న అల్లు అర్జున్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఒక టాలీవుడ్ నటుడు జిక్యూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకోవడం ఇదే ప్రధమం. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పై జిక్యూ టీమ్ ప్రేమ మరియు గౌరవాన్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఐతే జిక్యూ సంస్థ ఈ సంవత్సరం ఎంఓటివై అవార్డుల కోసం దీపికా పదుకొనే, కార్తీక్ ఆర్యన్, రాజ్‌కుమార్ రావు, భూమి పెడ్నేకర్, రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ మరియు అయాన్ ముఖర్జీ వంటి ఇతర నటుల రచనలను కూడా హైలైట్ చేస్తోంది. మొత్తంగా మన ఐకాన్ స్టార్ కి ఈ ప్రఖ్యాత అవార్డు దక్కడంతో పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకి అభినందనలు తెలియచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు