వైరల్ పిక్ : అల్లు అర్జున్ తో మెమొరబుల్ పిక్ షేర్ చేసిన స్నేహా రెడ్డి

వైరల్ పిక్ : అల్లు అర్జున్ తో మెమొరబుల్ పిక్ షేర్ చేసిన స్నేహా రెడ్డి

Published on Dec 23, 2022 2:00 AM IST


టాలీవుడ్ యువ కథానాయకుల్లో ప్రస్తుతం వరుసగా పలు సక్సెస్ లతో ఎందరో ప్రేక్షకాభిమానుల ప్రేమని చూరగొని దూసుకెళ్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గత ఏడాది డిసెంబర్ లో పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రైజ్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్, ప్రస్తుతం దానికి సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ లో నటిస్తున్నారు.

ఇక ఆయన భార్య స్నేహా రెడ్డి తరచు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. అలానే తమ ఫ్యామిలీ లైఫ్ కి సంబదించిన పలు విషయాలు ప్రేక్షకులు, అభిమానులతో తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకునే అలవాటు గల స్నేహ రెడ్డి, భర్త అల్లు అర్జున్ తో కలిసి ఒక వేడుకలో భాగంగా కొన్నేళ్ల క్రితం దిగిన ఒక మెమొరబుల్ పిక్ ని ఇన్స్టాగ్రమ్ లో షేర్ చేసారు. త్రో బ్యాక్ తర్స్ డే అంటూ కొద్దిసేపటి క్రితం స్నేహా రెడ్డి షేర్ చేసిన ఆ పిక్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు