అమర్ అక్బర్ అంటొని షూటింగ్ ముగించాడు !


‘నేల టిక్కెట్టు’ తరువాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ అంటొని’. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో ఇలియానా కథానాయికగా నటిస్తుంది. ఇక ఈరోజుతో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయింది. రవితేజ త్రిపాత్రభినయం చేస్తున్న ఈచిత్రాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అక్టోబర్ 5న విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చిత్ర వర్గాలనుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదలవ్వడం కష్టమే అని తెలుస్తుంది.

పక్క కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ కమిడియన్ గా నటిస్తున్నారు . తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక వరుస పరాజయాలతో సతమవుతున్న రవితేజ, శ్రీను వైట్లకు ఈచిత్రం విజయం సాధించడం చాలా అవసరం.

Exit mobile version