అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ !


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన పాత్రలకు దర్శకుడు శ్రీనివైట్ల దగ్గర ఉండి మరి డబ్బింగ్ చెప్పిస్తున్నాడు. పోస్ట్-ప్రొడక్షన్ పనులను శ్రీను వైట్ల తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకోవడం దాన్నిబట్టి… ఆయన ఈ సినిమా పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.

ఇక గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి ఈ చిత్రంతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది . గత కొంతకాలంగా శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరూ వరుస పరాజయాలతో సతమతవుతున్నారు. దాంతో ఈ చిత్రం విజయం ఈ ఇద్దరికీ చాలా కీలకం గా కానుంది. ఈ సారి మాత్రం ఇద్దరు భారీ సక్సెస్ కొట్టేలానే ఉన్నారు.

Exit mobile version