దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన “ఆర్ఆర్ఆర్”. చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్లో బిజీబిజీగా గడుపుతోంది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. ఇదిలా ఉంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లపై ఓ ఆర్టిస్టు తమ అభిమానాన్ని చాటుకున్నాడు.
చిత్తూరు గుడుపల్లి మండలం సంగణపల్లి పంచాయతీ పరిధిలోని చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన పురుషోత్తం ఓ వినూత్న ప్రయత్నంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన అతడు 15 వేల టీ కప్పులతో ఎన్టీఆర్, రామచరణ్ల చిత్రాలు ఏర్పాటు చేసి యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపాడు. ఒకే ఫ్రేమ్లో ఒక వైపు రామ్ చరణ్, మరోవైపు ఎన్టీఆర్ కనిపించేలా చిత్రీకరించాడు. ప్రస్తుతం ఈ ఆర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.