అమీర్ ఆ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలనుకుంటున్నాడట !

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’. విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ , ఫాతిమా సన షేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈచిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి హిందీతో పాటు ఒకేసారి విడుదలచేయనున్నారని సమాచారం.

ఆమీర్ నటించిన గత చిత్రాలు ‘త్రీ ఇడియట్స్ , పీకే ‘ హిందీ భాషలో తెలుగు రాష్ట్రాల్లో విడుదలై విజయం సాధించాయి. అయితే ఈ చిత్రాన్ని మాత్రం తెలుగులోకి డబ్ చేసి ఇక్కడ విడుదల చేయాలనీ పట్టుబడుతున్నాడట ఈ హీరో. భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం యొక్క ట్రైలర్ ఈనెల 27న విడుదలయ్యే అవకాశాలు వున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version