సూపర్ మొమెంట్ : వైజయంతి మూవీస్ న్యూ ఆఫీస్ ప్రారంభించిన అమితాబ్, ప్రభాస్

సూపర్ మొమెంట్ : వైజయంతి మూవీస్ న్యూ ఆఫీస్ ప్రారంభించిన అమితాబ్, ప్రభాస్

Published on Jun 29, 2022 10:00 PM IST

టాలీవుడ్ లోని ప్రఖ్యాత నిర్మాణ సంస్థల్లో వైజయంతి మూవీ సంస్థ కూడా ఒకటి. ఇప్పటివరకు అనేక అత్యద్భుత చిత్రాలను ఈ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ప్రస్తుతం 50వ ఏట అడుగుపెట్టిన ఈ భారీ సంస్థ నుండి లేటెస్ట్ గా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ కె. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీని నాగ అశ్విన్ తీస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే విషయం ఏమిటంటే, హైదరాబాద్ లో వైజయంతి మూవీస్ వారి సరికొత్త ఆఫీస్ ని ఇటీవల డార్లింగ్ ప్రభాస్ తో కలిసి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. అశ్వినీదత్, నాగ అశ్విన్, స్వప్న దత్ తో పాటు ప్రశాంత్ నీల్, రాఘవేంద్ర రావు, జి ఆదిశేషగిరిరావు, హీరో నాని సహా మరికొందరు ఈ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక కొద్దిసేపటి క్రితం దీని ప్రారంభోత్సవ గ్లింప్స్ వీడియో ని వైజయంతి సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఇక తమ సంస్థ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుండే సాగుతాయని సంస్థ టీమ్ సభ్యులు చెప్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు