సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అనగనగా ఓ ప్రేమకథ’ !

విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతూ అనగనగా ఓ ప్రేమకథ” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొంది, చూడ చక్కని చిత్రంగా, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకొంది.

ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..’ సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆ తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించటం జరిగింది. సినిమా ప్రేక్షకుడికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉంది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.యన్.రాజు తెలిపారు.

ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి

Exit mobile version