మరో బాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ మూవీ చైనా లో విడుదలకానుంది !

ఆయుష్మాన్ ఖురానా ,టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘అంధాదున్’. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2018 కిగాను అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది ఈ చిత్రం. ఇక ఈచిత్రం ఇప్పుడు చైనా లో విడుదలకానుంది.

సుమారు 5000 కు పైగా స్క్రీన్ లలో ‘పియానో ప్లేయర్’ అనే టైటిల్ తో ఈ చిత్రం అక్కడ ఏప్రిల్ 3న విడుదలకానుంది. కాగా ఈ చిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Exit mobile version