ఉప్పెన బ్యూటీ కృతిశెట్టికి మరో బంఫర్ ఆఫర్..!

ఉప్పెన బ్యూటీ కృతిశెట్టికి మరో బంఫర్ ఆఫర్..!

Published on Jun 7, 2022 10:59 PM IST

ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగువారికి పరిచయమైన కన్నడ బ్యూటీ ‘కృతిశెట్టి’ వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో భారీ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ హీరోయిన్ అనే ముద్ర వేసుకుంది కృతిశెట్టి.

ఇప్పటికే తెలుగులో సుధీర్ బాబు సరసన “ఆ అమ్మాయి గురుంచి మీకు చెప్పాలి”, నితిన్ జంటగా ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్ పోతినేని జంటగా “ది వారియర్” అనే సినిమాల్లో నటిస్తుంది. ఇక విలక్షణ దర్శకుడు బాలా, స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ద్వారా కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది కృతిశెట్టి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజాగా హీరో ధనుష్ సరసన నటించేందుకు కృతిశెట్టి ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అరున్ మాధేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా ప్రియాంక అరుళ్ మోహన్‌ని హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడంతో ఆ ఛాన్స్ కృతిశెట్టిని వరించినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు