‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ !

‘మహా సముద్రం’లో మరో హీరోయిన్ !

Published on Oct 19, 2020 9:40 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోనట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో మరో మలయాళీ బ్యూటీ అనూ ఇమాన్యుల్ మరో మహిళా ప్రధాన పాత్రను నటించబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఇక త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలకు వస్తే.. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమాన్యుల్ తదితరులు నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు