రమేష్ ముక్కెర దర్శకత్వం కౌండిన్య మూవీస్ పతాకంపై నటుడు, నిర్మాత తాళ్లపల్లి దామోదర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `అనువంశికత`. `పెరెల్స్ ఆఫ్ కిన్ షిప్ లవ్` అనేది ఉపశీర్షిక. సంతోష్ రాజ్, నేహా దేశ్ పాండే జంటగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మంగళవారం ఫిలించాంబర్ లో తెలంగాణా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…“ట్రైలర్ బావుంది. సినిమా తీయడమే సాహసం. అలాంటిది సమాజానికి సందేశం అందించే సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇంత వరకూ ఎవరు టచ్ చేయని అంశంతో సినిమా చేస్తోన్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా. ఇలాంటి కాన్సెప్ట్స్ తో వచ్చే చిత్రాలను ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ…“సినిమాల పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది . దానికి ఇటీవల కొన్ని సినిమాల పుటేజ్ బయటకు రావడమే ఉదాహారణ. ఇలాంటివి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకరావాలి. ఇక ఈ సినిమాలో ఓ గొప్ప సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి.. ఇందులో నేను మంచి పాత్ర చేశాను. దర్శకుడు రమేష్ గారే దీనికి మ్యూజిక్ కూడా చేశారు. పాటలు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర నిర్మాత ఇందులో మంచి పాత్ర కూడా చేశారు“ అన్ని అన్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నేహా దేశ్ పాండే మాట్లాడుతూ.. “ఇదొక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్. చాలా మంచి క్యారక్టర్ చేశాను. మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. అందరూ సినిమాను చూసి బ్లెస్ చేయాలన్నారు. నిర్మాత దామోదర్ గౌడ్ మాట్లాడుతూ…“సినిమా షూటింగ్ మొత్తం వరంగల్ లో చేశాం. నేను ఇనిస్పిరేషన్ గా తీసుకునే మధుసూదనాచారి గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 24న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.
దర్శకుడు రమేష్ ముక్కెర మాట్లాడుతూ…“భావి తరాలకు మేనరికపు సంబధాలు చేసుకుంటే జరిగే అనర్థాలను మా సినిమా ద్వారా చూపిస్తున్నాం. సెన్సార్ కార్యక్ర మాలు పూర్తయ్యాయి. ఎన్నో కష్టాలకోర్చి సినిమాను తీసాం. ఇటీవల మా చిత్రాన్ని చూసి చాలా మంది ప్రముఖులు, సె న్సార్ సభ్యులు సినిమాకు కచ్చితంగా అవార్డ్ వస్తుందని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది.