‘అరవింద’ విజయోత్సవ సభకు అభిమానుల్లో విశేషమైన స్పందన !


ఎన్టీఆర్ తన నటనా చాతుర్యంతో ‘అరవింద సమేత’ చిత్రాన్ని విశేషమైన విజయ తీరాలకు చేర్చి.. వరుసగా ఆరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామీనా ఏంటో చూపించారు. ఈ సందర్భంగా ‘అరవింద సమేత’ చిత్రబృందం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ సభను నిర్వహించేందుకు అట్టహాసంగా తగిన ఏర్పాట్లు చేసింది.

కాగా విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. బాలయ్య వస్తుండటంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధలు లేకుండా పోయింది. మొత్తానికి ఈ విజయోత్సవ సభకు అభిమానుల్లో విశేషమైన స్పందన వస్తోంది. రాష్ట్ర నలుమూలల నుండి ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున శిల్పకళా వేదికకు చేరుకుంటున్నారు.

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు అతి క్రూరమైన విలన్ గా నటించి మెప్పించిన జగపతిబాబుకు, అలాంటి విలన్ వారసుడిగా నటించిన నవీన్ చంద్రకు కూడా మంచి పేరు రావడం విశేషం

Exit mobile version