‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీలోకి ఎప్పుడు, ఎక్కడంటే?

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ఓటీటీలోకి ఎప్పుడు, ఎక్కడంటే?

Published on May 7, 2022 1:05 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, రుక్సర్ దిల్లాన్ హీరోయిన్‌గా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం “అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించారు. నిన్న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

ఫ్యామిలీ ఎమోషన్స్‌, కామెడీగా సాగే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా రాబోతుందట. ఇప్పటికే ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం. యూత్‌లో విశ్వక్‌కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాను మంచి ఫ్యాన్సీ రేటుకే ఆహా కొనుగోలు చేసిందట. అయితే నెల రోజుల తర్వాత ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కి వస్తుందని అంటే జూన్‌ మొదటి వారంలో రానుందని తెలుస్తుంది. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు