రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మాతలు గా వ్యవహరిస్తూ తీసిన సినిమా అతిధి దేవో భవ. ఆది సాయి కుమార్, నువేక్ష హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం నాడు నిర్మాతలు విలేకరుల తో తమ అనుభవాలను పంచుకున్నారు
ఒమిక్రాన్ వైరస్తో సినిమా పరిశ్రమ కాస్త గందరగోళంగా వున్నా అతిధి దేవో భవ చిత్రం కథ పై వున్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం. ఇందులో యూత్తోపాటు ఫ్యామిలీ అంశాలున్నాయి. ఆది సాయికుమార్ కెరీర్లో బెస్ట్ చిత్రమవుతుంది అని అన్నారు.
ఈ సినిమా కథ వేణుగోపాల్ ది. స్క్రీన్ ప్లే నేను, మా వదిన రాశామని అశోక్ రెడ్డి మిర్యాల తెలిపారు. సంభాషణలు కూడా నేను రాయడానికి చిన్నతనం నుంచి వున్న పరిశీలనతో పాటు లెక్చరర్గా చేసిన అనుభవం కూడా దోహదపడింది. సినిమాపై మక్కువతోనే లెక్చరర్ ఉద్యోగ్యం వదిలేసి వచ్చాను అంటూ అశోక్ రెడ్డి మిర్యాల అన్నారు.
ఈ చిత్రం జోనర్ ఎటువంటిది అని చెప్పాలంటే మొదటి భాగం లవబుల్గా వుంటుంది. సెకండాఫ్ థ్రిల్లింగ్ ఎమోషన్స్ వున్నాయి. ట్రైలర్లో చూసినట్లుగా హార్రర్ కథ మాత్రం కాదు అంటూ చెప్పుకొచ్చారు.
మా సోదరుడు రాజాబాబు వ్యాపార రంగంలో వున్నాడు. మరో సోదరుడు అఖండ వంటి సినిమాలు తీస్తున్నాడు. నేను లెక్చరర్గా వున్నా సినిమాలు ఎక్కువగా చూడడంతో ఎప్పటికైనా దర్శకత్వం చేయాలనేది నా గోల్. అందుకే మొదటగా ఒక మంచి సినిమా చేయాలని అతిధి దేవో భవ సినిమా చేశాం. మా సినిమాకు ఈరోజే సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మంచి సినిమా తీశారని ప్రశంస దక్కింది. అదేవిధంగా ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం హైలైట్గా వుంటుంది.
మామూలుగా ఈ సినిమాను నవంబర్ లోనే విడుదల చేయాలనుకున్నాం. కానీ అప్పటికి సంగీతం పనులు పూర్తికాలేదు. అన్నీ పూర్తయ్యాక జనవరి 26న విడుదల చేద్దామని నిర్ణయించాం. కానీ దైవ నిర్ణయం అనుకోకండా ఆర్.ఆర్.ఆర్. వాయిదా పడడం. అదే రోజు సంక్రాంతికి మాకు డేట్ రావడం అదృష్టంగా భావిస్తున్నాం. అతిధి దేవో భవ సినిమాకు ముందుగా కొత్తవారితో అనుకున్నాం. కానీ కథను రాసుకున్నాక మేమూ నిర్మాతలుగా కొత్త కనుక హీరో కొంచెం అనుభవం వున్న వ్యక్తి బెటర్ అనుకుని ఆది సాయికుమార్ను ఎంపిక చేశాం. అదే విధంగా నాయికగా నువేక్ష నటించింది. ఇద్దరూ కథా పరంగా బాగా నటించారు. నువేక్షకు బాష రాకపోయినా ఎమోషన్స్ను బాగా పట్టి కథను సన్నివేశాన్ని మెప్పించింది.
కొత్త నిర్మాతలకు థియేటర్ల సమస్యలుంటాయని అనుకున్నాం. ఒక రకంగా భయమేసింది కూడా. కానీ కథపై వున్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నెట్టింది. తొలుత మేము ఓ కథను అనుకున్నాం. కానీ అది చేయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. అందుకే మీడియంగా ఓ సినిమా చేద్దామని ఆదితో ఈ సినిమా చేశాం. చాలా సంతృప్తికరంగా వచ్చింది. మా సోదరుడు రవీందర్ రెడ్డి కూడా ప్రోత్సహించారు అని అన్నారు.
ఈ సినిమాలో లవ్, ఎమోషన్స్తోపాటు కామెడీ కూడా వుంది. సప్తగిరి, ఇమ్యాన్యుయేల్ ఎంటర్టైన్ మెంట్ అందరికీ బాగా నచ్చుతుంది. సప్తగిరి పాత్ర గతంలో చేసిన ప్రేమకథా చిత్రమ్ కంటే బాగుండేలా ప్లాన్ చేశాం. సీనియర్ నటి రోహిణి గారు ఇందులో నటించారు. తను ఎమోషన్ బాగా పండించారు. ఇక చిత్ర దర్శకుడు ఎదుటివారిని అర్థం చేసుకునే వ్యక్తి. ఎవరికి ఏమి కావాలో అన్ని తెలిసుకుని సినిమాను సరైన విధంగా పూర్తి చేసేలా సహకరించారు. ఈ షూటింగ్ టాకీ హైదరాబాద్ లో పాటలు డార్జిలింగ్ చేశాం. తొలి సినిమాతో మేము చాలా జ్ఞానం సంపాదించాం. ఏదైనా వ్యాపారం చేస్తే ఒకరితో వుంటుంది. సినిమా కనుక వందమంది చేతిలో వుంటుంది. మొత్తంగా పాజిటివ్ అనుభవాన్ని సంపాదించాం అని తెలిపారు.