నన్ను దోచుకుందువటే హీరోయిన్ ను వారితో పోలుస్తున్నారు !

సుధీర్ బాబు హీరోగా ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఇటీవల విడుదలైన ఈచిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకొని విజయం దిశగా దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఈచిత్రం లో నాబా నటేష్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం తోనే ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సిరి అనే పాత్రలో సాఫ్ట్ వెర్ ఇంజనీర్ గా నటించింది. మొదటి సినిమాతోనే తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.

తాజాగా సోషల్ మీడియాలో కొందరు ఆమెను ‘బొమ్మరిల్లు’ చిత్రం లో జనీలియా పోషించిన హాసిని పాత్రతో అలాగే ‘ఫిదా’ సినిమాలో సాయి పల్లవి పోషించిన భానుమతి పాత్రలతో పోలుస్తూ ఈ ముగ్గురి హీరోయిన్ల ఫొటోలతో ట్వీట్లు చేస్తున్నారు. ఇక నాబా, మాస్ మహారాజ్ రవితేజ నటించనున్న చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయిందని సమాచారం. ఆమె తెలుగులో మరిన్ని సినిమాల్లో కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది.

Exit mobile version