ఇండియాలో భారీ మార్క్ కి చేరిన “అవతార్ 2” వసూళ్లు.!

ఇండియాలో భారీ మార్క్ కి చేరిన “అవతార్ 2” వసూళ్లు.!

Published on Dec 25, 2022 2:00 PM IST

ప్రపంచ సినిమా ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చిన భారీ విజువల్ ట్రీట్ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. హాలీవుడ్ టాప్ మాస్టర్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్ 160 దేశాలకి పైగా రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది. అలాగే మన దేశంలో కూడా ఈ చిత్రం మాసివ్ ఓపెనింగ్స్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమా మరో భారీ మార్క్ కి చేరినట్టుగా తెలుస్తుంది.

మొదటి రెండు మూడు రోజుల్లోనే 100 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టేయగా ఇప్పుడు ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర 200 కోట్ల నెట్ వసూళ్లు మార్క్ కి చేరినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకి ఇప్పటివరకు పర్వాలేదని చెప్పొచ్చు కానీ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా ఇది నిలుస్తుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం అనుమానంగానే ఉందని చెప్పాలి. ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో స్వల్పంగా వసూళ్లు తగ్గాయి మరి ఫైనల్ రన్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు