“కాంతార” పై బాహుబలి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు!

“కాంతార” పై బాహుబలి నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు!

Published on Oct 23, 2022 8:24 PM IST


శాండల్‌వుడ్‌లో ఇటీవల బ్లాక్‌బస్టర్ అయిన కాంతార ప్రేక్షకుల నుండి ప్రశంసలతో పాటు భారీ కలెక్షన్లను అందుకుంటుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ రోజు ది కాశ్మీరీ ఫైల్స్ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ సినిమాను మెచ్చుకున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో కాంతార మూవీ పై ప్రశంసల వర్షం కురిపించారు. కాంతారా! మైండ్ బ్లోన్. ఈ చిత్రంలాగా ఏ సినిమా నన్ను తాకలేదు. సినిమా బ్రిలియెన్స్, క్లైమాక్స్. ఓహ్ మై గాడ్. దయచేసి థియేటర్‌లలో చూడండి అని అన్నారు. అంతేకాక చిత్రం లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, మరియు సంగీతం సూపర్ అంటూ చెప్పుకొచ్చారు. కాంతార చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రం లో రిషబ్ శెట్టి నటించడం మాత్రమే కాకుండా, దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు