క్రిష్ మార్పులకు చేర్పులకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ !


క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బాలయ్యే స్వయంగా ఎన్టీఆర్ స్క్రిప్ట్ ను తన ఆలోచనలకు దగ్గరిగా రాయించుకున్నారు. బాలయ్య రాయించిన స్క్రిప్ట్ లో మార్పులు చేస్తూ బాలయ్యను ఒప్పించలేకే దర్శకుడు తేజా తప్పుకున్నాడు. ఆ తర్వాత క్రిష్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.

క్రిష్ గత నెల రోజులనుంచి ఈ బయోపిక్ స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నారు. కథనం చాలా వరకు మార్చారు. టోటల్ స్క్రిప్ట్ లో కూడా తనదైన శైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అయితే ఈ మార్పులను బాలయ్య అంగీకరిస్తాడా అనే సందేహం అందరిలోనూ ఉంది. కాగా క్రిష్ తాను చేసిన మార్పులు చేర్పులు సోమవారం బాలయ్యకు వినిపించారట. క్రిష్ చేసిన మార్పులు బాలయ్యకు బాగా నచ్చాయని తెలుస్తోంది. జులై 5న లో ఈ చిత్రం చిత్రీకరణ మొదలుపెట్టనున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు.

Exit mobile version