బాలయ్యతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ?

బాలయ్యతో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ?

Published on Mar 7, 2022 8:32 AM IST

డైరెక్టర్ పరుశురామ్ బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా పై మరో వార్త కూడా వినిపిస్తోంది. ఈ సినిమా మల్టీస్టారర్ అని.. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా వస్తోంది. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ తర్వాత.. పరశురామ్ బాలయ్యతో సినిమా చేస్తాడట.

పరశురామ్ గతంలోనే బాలయ్యకి ఓ కథ చెప్పాడు, ఆ కథనే ఇప్పుడు సినిమాగా చేయాలనుకుంటున్నాడు. మొత్తానికి ఈ కాంబినేషన్ నిజం అయితే మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత సినిమా కాబట్టి.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. మరి బాలయ్య కోసం పరుశురామ్ ఎలాంటి కథ రాశాడో చూడాలి. అలాగే వీరి కలయికలో వచ్చే సినిమా ఏ జోనర్ లో రానుందో కూడా చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు