‘వీరసింహారెడ్డి’ స్టాండీస్ తో నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి

‘వీరసింహారెడ్డి’ స్టాండీస్ తో నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి

Published on Dec 21, 2022 3:00 AM IST


టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీలో ఆయనకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా గోపీచంద్ మలినేని దీనికి దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే వీర సింహారెడ్డి నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, మోషన్ పోస్టర్ తో పాటు రెండు సాంగ్స్ నందమూరి ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి.

ఇక 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానున్న వీరసింహారెడ్డి మూవీ స్టాండీస్ ఇప్పటికే పలు ముఖ్య థియేటర్స్ కి చేరుకున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్స్ లో ఒకటి అయిన కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో వీరసింరెడ్డి స్టాండీస్ ఏర్పాటు చేయడంతో పలువురు బాలకృష్ణ అభిమానులు వాటికి పూలదండలు వేసి తమ అభిమాన హీరో స్టాండీస్ తో ఫోటోలు దిగి సందడి చేసారు. కాగా అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు