ఫోటో మూమెంట్: “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” టీమ్ తో బాలకృష్ణ

ఫోటో మూమెంట్: “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” టీమ్ తో బాలకృష్ణ

Published on Jul 3, 2022 8:37 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు ద్విపాత్రాభినయం చేయనున్నారు. మరోవైపు, అల్లరి నరేష్ తన రాబోయే చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు. దాని టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈరోజు ఒకే చోట నందమూరి బాలకృష్ణ మరియు ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీమ్ యాదృచ్ఛికంగా కలుసుకున్నాయి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీమ్ బాలకృష్ణ ను కలవడం సంతోషం వ్యక్తం చేస్తోంది. అల్లరి నరేష్ మరియు టీమ్‌తో బాలకృష్ణ ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు