అమెరికాలో ప్లాన్ చేస్తున్న బాలయ్య టీమ్ !

అమెరికాలో ప్లాన్ చేస్తున్న బాలయ్య టీమ్ !

Published on Apr 12, 2022 9:12 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి ఒక కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కథకు అనుగుణంగా అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. వీసా ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తి కాగా.. సమ్మర్ తర్వాత చిత్రబృందం ఈ షెడ్యూల్ కోసం బయల్దేరుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాగా రామ్ – లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పైగా ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న గోపిచంద్ ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు