దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో లేడీ విలన్ గా ఓ హీరోయిన్ నటించబోతుందని.. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి విలన్ రోల్ లో బాలయ్య పక్కన నటించబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల పై నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు ఒక్కడే పవర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ‘బాలయ్య’కి జగపతిబాబు ఒక్కడే విలన్.
బ్లాక్బస్టర్ `లెజెండ్` తర్వాత బాలకృష్ణ, జగపతిబాబు కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు చిరంతన్ భట్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. `జైసింహా` వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ హిట్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రమిది. మే 17న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అవుతుంది. అలాగే జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.