కమెడియన్ స్థాయి నుండి ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అగ్ర నిర్మాతల జాబితాలో చేరిపోయాడు. ఈ సినిమా విజయం తరువాత నుండి ఆయనకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. బాద్షా, ఇద్దరమ్మాయిలతో సినిమాలతో బిజీగా ఉన్న ఆయనకి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఐటీ దాడుల తరువాత ఆయన తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా పోస్ట్ చేసారు. తను కష్టపడి పైకి వచ్చానని, కష్టపడి పైకి వచ్చిన వాడిని లోకం నమ్మదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను ఎవరికీ బినామీ కాదు. నాకు ఆ అవసరం లేదు. నేను రాజకీయాల్లో లేను, మీ రాజకీయ లబ్ది కోసం నన్ను బలి చేయవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.