ఒకరోజు ముందే రాబోతున్న ‘భీమ్లా నాయక్’..!

ఒకరోజు ముందే రాబోతున్న ‘భీమ్లా నాయక్’..!

Published on Mar 22, 2022 9:18 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. భారీ అంచనాల మధ్య గత నెల 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని భారీగా కలెక్షన్లను రాబట్టుకుంటుంది. అయితే ఈ చిత్రం డిజిటల్ హక్కులను ఆహా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా మార్చి 25 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కి తీసుకొస్తున్నట్టు రెండు సంస్థలు ఇదివరకే ప్రకటించాయి. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే అనగా మార్చి 24 నుంచే స్ట్రీమింగ్‌కి తీసుకొస్తున్నట్టు రెండు సంస్థలు తెలిపాయి. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్‌లు హీరోయిన్స్‌గా నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే ఇవ్వగా, థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు