విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషీ సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రెండు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజు కూడా అదే జోరు కనబరుస్తోంది. విజయ్ కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లను రాబడుతోంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో హౌస్ ఫుల్ అయ్యింది. ముఖ్యం గా సింగిల్ స్క్రీన్ లలో ఈ చిత్రం కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
తిరుపతిలో ఖుషీ ను ప్రదర్శిస్తున్న 7 థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులు ప్రదర్శించగా, వైజాగ్లోని 6 సింగిల్ స్క్రీన్లు ఈరోజు సాయంత్రం హౌస్ఫుల్ షోలను నమోదు చేసుకున్నాయి. విజయవాడలో ఖుషీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న మరో 6 థియేటర్లు ఆదివారం సాయంత్రం పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇంత సాలిడ్ షోతో జంట తెలుగు రాష్ట్రాల్లోని టికెట్ కౌంటర్లలో ఖుషీ భారీ షేర్ ని వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మించారు.