పూర్తిగా లాక్‌డౌన్‌లోకి బిగ్‌బాస్ హౌస్.. ఎందుకోసమంటే?

పూర్తిగా లాక్‌డౌన్‌లోకి బిగ్‌బాస్ హౌస్.. ఎందుకోసమంటే?

Published on Oct 27, 2021 12:08 AM IST


బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్ 5 అప్పుడే ఏడు వారాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వెళ్లగా మొదటి వారం సరయూ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత వర్మ, మొన్న వారం ప్రియ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు.

అయితే ప్రతి వారం మాదిరిగానే సోమవారం కూడా నామినేషన్ల ప్రక్రియ వాడివేడిగా సాగింది. ఈ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సింగర్ శ్రీరామచంద్ర, మానస్, రవి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ వారం బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ‘అభయహస్తం’ కాగా, ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్ పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండనుంది. అయితే ఓ ఛాలెంజ్ ఇచ్చి అందులో గెలిచిన సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశంతో పాటు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం లభించనుందని తెలుస్తుంది. మరీ ఈ ‘అభయహస్తం’ టాస్క్‌పై ఓ క్లారిటీ రావాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ని చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు