బెల్లకొండ శ్రీనివాస్ తాజా చిత్రం రాక్షసుడు ఇంకా మూడు రోజులలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీమియర్స్ ఆగస్టు 1వ తేదీనే యూఎస్ లో ప్రదర్శించనున్నారు. కాగా యూఎస్ లోని హ్యూస్టన్ సముద్ర తీరాన ఓ ఫ్లైటుకి ఏరియల్ బ్యానర్ కట్టి వినూత్నంగా ‘రాక్షసుడు’ చిత్రాన్ని ప్రచారం చేశారు. “అల్ ది బెస్ట్ టు బెల్లంకొండాస్ రాక్షసుడు టీం” అని రాసిఉన్న ఓ ఏరియల్ బ్యానర్ హ్యూస్టన్ సముద్రం తీరంపై ఆకాశంలో చక్కర్లు కొట్టింది.
ఈ విషయాన్నీ స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ ప్రచారం కొరకు డిస్ట్రిబ్యూటర్స్ చేపట్టిన ఇలాంటి వినూత్న కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపాడు. ‘రాక్షసుడు’ చిత్రాన్ని యూఎస్ విడుదల హక్కులను వీకెండ్ సినిమాస్ దక్కించుకుంది. ‘రాక్షసుడు’ చిత్రంలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా, రాజీవ్ కనకాల,సుజానే జార్జ్,నాన్ శరవణన్,వినోద్ సాగర్,రాధా రవి కీలక పాత్రలలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
What an innovative idea to promote????
Thanks to my USA ???????? distributors☺
Aerial banner in Houston TX????@anupamahere @AbhishekPicture @GhibranOfficial #RameshVarma Premiers from August 1st.Overseas by @WeekendCinemaUS pic.twitter.com/ICwVx3Opzk
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) July 30, 2019