అల్లు అర్జున్ “పుష్ప ది రూల్” కి పెరిగిన బడ్జెట్?

అల్లు అర్జున్ “పుష్ప ది రూల్” కి పెరిగిన బడ్జెట్?

Published on Nov 9, 2022 6:57 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం తో అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా అమాంతాం పెరిగి పోయింది. అయితే ఈ చిత్రం పార్ట్ 2 పుష్ప ది రూల్ షూటింగ్ ను త్వరలో స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా బడ్జెట్ ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది.అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా బడ్జెట్ పెరిగినట్లు తెలుస్తుంది. ఇందుకు కారణం పుష్ప పార్ట్ 1 కి వచ్చిన క్రేజే. మైత్రి మూవీ మేకర్స్ మేకింగ్ విషయం లో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను భారీగా తెరకెక్కించేందుకు రెడీ అవుతుంది.

అల్లు అర్జున్ సైతం సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ కంటే మరింత భారీగా ఉండనుంది అని ఇదివరకు తెలిపారు. రిలీజ్ డేట్ దగ్గర పడే సమయం లో సినిమా బిజినెస్ కూడా భారీగా చేసే అవకాశం ఉంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అజయ్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు