రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ‘ఆది’ హీరోగా నటిస్తున్న రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనే కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం ‘బుర్రకథ’. కాగా ఈ సినిమా జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా విడుదల తేదీ జూన్ 28 నుండి జూన్ 29కి షిఫ్ట్ అయింది.
కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుని విడుదల చేస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై హెచ్ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆది సరసన మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.