అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల జైనబ్ రవడ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక సింపుల్గా జరిగింది. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
మార్చి 24న అఖిల్, జైనబ్ల వివాహ ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ ముహూర్తానికి రెండు కుటుంబాలు అంగీకరించాయని.. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు ఈ వివాహ వేడుకకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఇక ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అక్కినేని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడని.. ఈ పెళ్లి వేడుకకు సినీ తారలతో పాటు పలువురు క్రికెట్ స్టార్స్, రాజకీయ నేతలను కూడా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి అఖిల్ వివాహంతో అక్కినేని ఫ్యామిలీలో మరోసారి పెళ్లిసందడి కనిపించబోతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, అఖిల్ ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.