ఎన్టీఆర్ సినిమా పై క్రేజీ అప్ డేట్.. ఫిబ్రవరి నుంచి మొదలు !

ఎన్టీఆర్ సినిమా పై క్రేజీ అప్ డేట్.. ఫిబ్రవరి నుంచి మొదలు !

Published on Nov 7, 2022 8:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి ఉంది. ఐతే, తాజాగా ఈ సినిమా షూట్ ఫిబ్రవరి నుంచి వుంటుందని తెలుస్తోంది. కాకపోతే ఈ లోపు ముహుర్తాల లాంటివి ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట.

కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు