ఎన్టీఆర్ మ్యానరిజమ్ పై క్రేజీ న్యూస్ ?

ఎన్టీఆర్ మ్యానరిజమ్ పై క్రేజీ న్యూస్ ?

Published on Dec 13, 2022 2:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే, తారక్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ను ట్రై చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ మ్యానరిజమ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఎన్టీఆర్ పాత్రకి సినిమాలో చేతికి ఆరు వేళ్ళు ఉంటాయట. కోపం వచ్చిన ప్రతిసారి ఆరో వేలు బిగుసుకు పోతుందని.. ఎన్టీఆర్ పాత్ర సీరియస్ నెస్ ను ఈ వేలుతో పలు సందర్భాల్లో సింబాలిక్ గా ఎస్టాబ్లిష్ చేస్తారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ సినిమా షూట్ వేగంగా జరగనుంది. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు