శిఖరం లాంటి రజనీ పై విమర్శలా !

శిఖరం లాంటి రజనీ పై విమర్శలా !

Published on May 1, 2023 2:00 PM IST

సూప‌ర్‌ స్టార్ ర‌జినీకాంత్, సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో పాల్గొని.. చంద్ర‌బాబును సపోర్ట్ చేస్తూ రాజ‌కీయంగా బాబుని ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. అయితే, ర‌జినీకాంత్ కామెంట్స్ పై వైసీపీ నేత‌లు సీరియస్ అయ్యారు. సూప‌ర్‌ స్టార్ అని కూడా చూడకుండా నేరుగా ర‌జినీకాంత్ ని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు, ర‌జినీకాంత్ కి సపోర్ట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాడు.

‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’ అని బాబు ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు