టాక్..”చరణ్ 15″ మరింత లేట్ అవ్వనుందా.?

టాక్..”చరణ్ 15″ మరింత లేట్ అవ్వనుందా.?

Published on Nov 13, 2022 8:47 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అటు చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో 15వ సినిమా ఇది కాగా ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా మేకర్స్ అయితే వచ్చే ఏడాది ఉగాది కానుకగా సినిమాని అయితే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా పలు వార్తలు ఆ మధ్య వినిపించాయి. అయితే షూటింగ్ కూడా దగ్గరకు అవుతుంది కానీ లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఇక ఈ చిత్రం అయితే ఇంకా మూడు నెలల మేర షూటింగ్ ని బాలన్స్ ఉంచుకున్నట్టు లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో అయితే రిలీజ్ వచ్చే ఏడాది ఆరో నెల తర్వాతే అన్నట్టుగా టాక్ స్టార్ట్ అయ్యింది. మరి ఇందులో అయితే ఎంత వరకు నిజముందో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు