ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఛార్మి !

ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన ఛార్మి !

Published on Apr 4, 2022 11:00 AM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లైగర్’. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. ఐతే, లైగర్ సినిమా నిర్మాణ క్రమంలో కరణ్ జోహార్ తో పూరి, ఛార్మిలకు మంచి అనుబంధం ఏర్పడింది.

తాజాగా ఛార్మి పోస్ట్ చేసిన ఓ ఫోటో చూస్తుంటే.. వీరి మధ్య బాండింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ప్రస్తుతం కరణ్ జోహార్.. రణవీర్ సింగ్ హీరోగా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా సెట్ కి వెళ్లిన పూరి, ఛార్మి లకు అక్కడ కరణ్ జోహార్ తో పాటు రణవీర్ సింగ్ కూడా గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. మంచి ఆదిత్యం కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక ఫోటో కూడా దిగారు.

కాగా ఈ ఫోటోను ఛార్మి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సెట్స్‌లో మీ ఎనర్జీ మరియు బాండింగ్ తో మా పై అద్భుతమైన వైబ్ చూపించారు రణవీర్ సింగ్. ఇక కరణ్ జోహార్.. మీరు ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు’ అంటూ ఛార్మి మెసేజ్ పెట్టింది. ఇక ఛార్మి పోస్ట్ చేసిన ఫోటోలో పూరి – ఛార్మి ల మధ్యలో రణవీర్ సింగ్ చాలా ఉత్సాహంగా కనిపించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు