రేపు మీడియా ముందుకి మెగాస్టార్, మాస్ రాజా … అందుకోసమేనా ?

రేపు మీడియా ముందుకి మెగాస్టార్, మాస్ రాజా … అందుకోసమేనా ?

Published on Dec 27, 2022 2:02 AM IST

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పై మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా యువ దర్శకుడు బాబీ ఈ మూవీని మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ, ఏసిపి విక్రమ్ సాగర్ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఇటీవల వాల్తేరు వీరయ్య నుండి రిలీజ్ అయిన టైటిల్ టీజర్, రవితేజ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతం పెంచేసాయి. అయితే విషయం ఏమిటంటే, రేపు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా వాల్తేరు వీరయ్య మూవీ గురించి తమ అనుభవాలు పంచుకునేందుకు మీడియా ముందుకి రానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. కాగా ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు