ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్, సాయి మంజ్రేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా, జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మించాయి. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మంచి కలెక్షన్లతో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు సైతం లభిస్తున్నాయి.
అయితే తాజాగా మేజర్ మూవీ చిత్ర యూనిట్పై మెగాస్టార్ చిరంజీవి అభినందనల వర్షం కురిపించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన చిరంజీవి ‘మేజర్’ చిత్రబృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మేజర్ ఒక సినిమా మాత్రమే కాదు. అదొక నిజమైన ఎమోషన్ అని, అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని హత్తుకునేలా సినిమాను తెరకెక్కించారని, తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీని మహేశ్బాబు నిర్మించినందుకు గర్వంగా ఉంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు.
#Major is not a film.Its truly an Emotion
Story of a great Hero & Martyr#MajorSandeepUnnikrishnan told in the most poignant way.A must-watch
Proud of @urstrulyMahesh for backing such a purposeful film
HeartyCongrats to @AdiviSesh @saieemmanjrekar #Sobhita @SashiTikka & Team pic.twitter.com/1lW1m3xmFO
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 13, 2022