తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌ గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

తెలుగు ప్రేక్షకులు ఎమోషనల్‌ గా కనెక్ట్ అవుతారు – చిరంజీవి

Published on Aug 7, 2022 4:56 PM IST

స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా “లాల్ సింగ్ చద్దా”. కాగా నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి ఈ “లాల్ సింగ్ చద్దా” సినిమాతో బాలివుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఆమిర్‌ ఖాన్‌ కి కరీనా కపూర్‌ జోడిగా నటించిన ఈ చిత్రం హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, హైదరాబాద్‌ లోని ఏఎంబీ సినిమాస్‌ లో నిన్న రాత్రి సెలబ్రిటీల కోసం ఓ ప్రత్యేక ప్రీమియర్ షోను ఏర్పాటు చేశారు. అమీర్ ఖాన్, మోనా సింగ్, నాగ చైతన్య, నాగార్జున, అమల, హరీష్ శంకర్ మరియు పలువురు ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు హాజరయ్యారు. ప్రీమియర్ తర్వాత, చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ, “నేను ఇంతకుముందు చెప్పినట్లు, నాకు అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం. భారతదేశం గర్వించదగ్గ నటుడు ఆయన. తెలుగులో ఈ చిత్రాన్ని నేను అందిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను” అని చిరు అన్నారు.

చిరు ఇంకా మాట్లాడుతూ “తెలుగు వాళ్ళు ఈ సినిమాకి కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ప్రోత్సహిస్తారని ఎప్పుడూ రుజువు చేస్తూనే ఉన్నారు. ఆగస్టు 11న విడుదల కానున్న లాల్ సింగ్ చద్దా పట్ల కూడా వారు అదే ప్రేమను కురిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు