లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ మధ్య క్లాష్…. డీటెయిల్స్ ఇవే

లేటెస్ట్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ మధ్య క్లాష్…. డీటెయిల్స్ ఇవే

Published on Nov 17, 2022 9:41 PM IST


టాలీవుడ్ లో ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయం అందుకున్న సినిమాలు కార్తికేయ 2, సీతారామం. చందూ మొండేటి తీసిన కార్తికేయ 2 థ్రిల్లింగ్ అంశాలతో యాక్షన్ మూవీ గా తెరకెక్కగా హను రాఘవపూడి తీసిన సీతారామం ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇక ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ అనంతరం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతలు, బయ్యర్లకు కాసులు కురిపించాయి.

అయితే విషయం ఏమిటంటే, ఈనెల 20న ఆదివారం నాడు ఈ రెండు సినిమాలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా టివి ఆడియన్స్ ముందుకి రానున్నాయి. కాగా వీటిలో ముందుగా సీతారామం మూవీ స్టార్ మా లో సాయంత్రం 5 గం. 30 ని. లకు ప్రసారం కానుండగా అనంతరం 6 గం. లకు కార్తికేయ 2 జీ తెలుగులో ప్రసారం కానుంది. ఆ విధంగా సరిగ్గా అరగంట గ్యాప్ లో బుల్లితెర ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ రెండు సినిమాల మధ్య ఈ క్లాష్ ఏర్పడడంతో వీటి యొక్క టిఆర్పి ఎంత నమోదు అవుతుంది అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తికరంగా మారింది. మరి అది తెలియాలి అంటే కొన్నాళ్ల వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు