సుహస్ హీరోగా, చాందినీ చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కలర్ ఫొటో. ఈ చిత్రం ఆహా వీడియో ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో నటించిన హర్ష, సునీల్ లకు కూడా మంచి పేరును తీసుకు వచ్చింది. సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం గా ఉంది.
ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో ను స్టార్ మా తాజాగా విడుదల చేయడం జరిగింది. ఆహా వీడియో లో ప్రేక్షకులను అలరించిన కలర్ ఫొటో, బుల్లితెర పై ఎలాంటి విజయం సాధిస్తుందొ చూడాలి.