టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన చిత్రం ‘హను-మాన్’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సర్ప్రైజింగ్ హిట్గా నిలిచింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ను గతంలోనే అనౌన్స్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్.
2025లో ‘జై హనుమాన్’ మూవీ రిలీజ్ అవుతుందని అప్పట్లోనే ప్రకటించాడు. అయితే, ఈ సినిమాలో కన్నడ హీరో రిషబ్ శెట్టి లీడ్ రోల్లో నటించనున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. కానీ, ఈ సినిమా పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ మూవీ ‘కాంతార’ ప్రీక్వెల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘జై హనుమాన్’కు బల్క్ డేట్స్ కేటాయించగలడు.
దీంతో ప్రశాంత్ వర్మ కూడా వేరే చిత్రాలను తెరకెక్కించడం.. వేరే డైరెక్టర్స్కి కథలు అందించడంలో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కన చూస్తే, ‘జై హనుమాన్’ 2025లోనే కాదు 2026 లో కూడా రిలీజ్ కావడం కష్టం గా కనిపిస్తుంది. ఈ సినిమాను ప్రారంభించి, షూటింగ్ ముగించుకుని రిలీజ్ చేయాలంటే 2027లోనే సాధ్యమవుతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి నిజంగానే ‘జై హనుమాన్’ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదా అనేది వేచి చూడాలి.