పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ‘కనెక్ట్’ టీమ్ స్పెషల్ థాంక్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ‘కనెక్ట్’ టీమ్ స్పెషల్ థాంక్స్

Published on Dec 10, 2022 12:19 AM IST


లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ హర్రర్ జానర్ మూవీ కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా విగ్నేష్ శివన్ ఈ మూవీని భారీ వ్యయంతో నిర్మించారు. ఇక ఈ మూవీని తెలుగులో ప్రఖ్యాత సంస్థ యువి క్రియేషన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ నటులు సత్యరాజ్, అనుపమ్ ఖేర్ తో పాటు వినయ్ రాయ్, హనీయ నఫీస్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇటీవల రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకోగా నిన్న నైట్ ఈ మూవీ యొక్క తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆవిష్కరించారు.

ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో రూపొందిన కనెక్ట్ ట్రైలర్ ఆడియన్స్ లో మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది. కాగా తమ మూవీ ట్రైలర్ ని ఆవిష్కరించిన ప్రభాస్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ కనెక్ట్ మూవీ టీమ్ కొద్దిసేపటి కితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 22 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు