అప్పుడే “పుష్ప ది రూల్” నుంచి క్రేజీ ట్రీట్ రెడీ?

అప్పుడే “పుష్ప ది రూల్” నుంచి క్రేజీ ట్రీట్ రెడీ?

Published on Nov 5, 2022 8:08 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “పుష్ప ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా వస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో దీనిపై భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఇక ఈ చిత్రం షూటింగ్ కూడా ఈ నవంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ కానుండగా ఓ క్రేజీ టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది.

మేకర్స్ అయితే ఈ ఏడాది లోనే భారీ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ డిసెంబర్ లో రిలీజ్ అవుతున్న అవతార్ 2 తో అయితే ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ లేదా టీజర్ ని అనేక భాషల్లో యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది క్లారిటీ లేదు కానీ ఈ రూమర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యిండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు